కవిత అరెస్టు అయితే తెలంగాణ ఆత్మగౌరవం ఎందుకు దెబ్బతింటుంది : భట్టి విక్రమార్క

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కుంభకోణాలకు నోటీసులిస్తే అది తెలంగాణ ప్రజలకు ఎలా అమానకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అక్రమాలు చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అవినీతిని రూపుమాపుతామని పార్టీ పెట్టిన కేజ్రీవాల్‌.. దేశంలో ఏ పార్టీ చేయలేనంత అవినీతిని చేశారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు.

ఆమ్ ఆద్మీ అని ఓ పార్టీ పట్టి అర్వింద్ కేజ్రీవాల్ దేశంలో ఎవరూ చేయలేనంత అవినీతి చేశారు. ఇంత జరుగుతోంటే అన్నాహజరే ఎక్కడున్నారు..? దిల్లీ మద్యం కుంభకోణంపై అన్నాహజరే మాట్లాడాలి. ప్రభుత్వ పాలసీకి మంత్రివర్గం ఆమోదం ఉండాల్సిందే. కేజ్రీవాల్‌ కూడా రాజీనామా చేయాలి. మద్యం కేసుకు తెలంగాణకు ఏం సంబంధం. కవిత అరెస్ట్‌ అయితే తెలంగాణ అత్మగౌరవం ఎలా దెబ్బతింటుంది? అని సీఎల్పీ భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news