భీమ్లానాయ‌క్ ఈవెంట్ వ‌ద్ద ఉద్రిక్త‌త..!

-

యూసూఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్ వ‌ద్ద ఉద్రిక్త‌త చోటు చేసుకున్న‌ది. పోలీస్ బెటాలియ‌న్ గ్రౌండ్ వ‌ద్ద భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీగా అభిమానులు త‌ర‌లి వ‌స్తున్నారు. బారికేడ్లు త‌న్నేసి అభిమానులు ఈవెంట్ లోపలికి వెళ్లారు. దీంతో అభిమానుల‌ను పోలీసులు కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నారు. అభిమానుల‌ను త‌రిమేస్తున్నారు. పోలీసుల‌కు, అభిమానుల‌కు మ‌ధ్య తొక్కిస‌లాట జ‌రిగింది. దీంతో పోలీసులు స్వ‌ల్పంగా లాఠీచార్జ్ చేశారు. అనుమ‌తి లేకుండా ఈవెంట్ కు వ‌చ్చిన అభిమానులు వేదిక వ‌ద్ద‌కు అనుమ‌తించ‌డం లేదు. యూసుఫ్‌గూడ బ‌య‌ట ప‌రిస‌రాల్లో అభిమానుల కోలాహ‌లం నెల‌కొన్న‌ది.

మ‌రొక వైపు భీమ్లానాయ‌క్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక జ‌రుగుతుంది. చిత్ర యూనిట్‌తో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా స‌హా మంత్రి కేటీఆర్‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ హాజ‌ర‌య్యారు. పాస్‌ల‌ను లిమిట్ ప్ర‌కార‌మే జారీ చేశారు. అభిమానులు మాత్రం ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. ఏలాగైనా స‌రే లోప‌లికి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news