చంద్రబాబు అసభ్య పదజాలం మానవజాతే తలదించుకునేలా ఉంది : భూమన కరుణాకర్‌రెడ్డి

-

ఏపీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు
ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికార దాహంతో సభ్య సమాజం తలదించుకునేలా సంస్కారహీనమైన భాషను మాట్లాడడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. కర్నూలు పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన అసభ్య పదజాలం మానవజాతే తలదించుకునేలా ఉందని, 44 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన నేర్చుకున్నది ఇదేనా? అని ప్రశ్నించారు భూమన కరుణాకర్‌రెడ్డి. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న తలంపుతో యువతను రెచ్చగొడుతూ, అసభ్య పదజాలంతో మాట్లాడడం చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి.

Govt giving top priority to public health: MLA Bhumana Karunakar Reddy

‘ఇదే నా చివరి ఎన్నికలు, ఓట్లు వేసి గెలిపించండి, లేకుంటే మీరే నష్టపోతారు’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ, బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు భూమన కరుణాకర్‌రెడ్డి. మొరార్జీదేశాయ్‌ 90 ఏళ్ల పాటు రాజకీయాలు చేశారని, జయప్రకాష్‌ నారాయణ 85 ఏళ్లు, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 83 ఏళ్లు, కరుణానిధి 93 ఏళ్ల పాటు రాజకీయాలు చేశారని, రాజకీయాలే నా వృత్తి, నా ప్రవృత్తి అని చెప్పుకొనే చంద్రబాబు 74 ఏళ్లకే చివరి ఎన్నికలు
అని చెప్పుకొంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు భూమన కరుణాకర్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news