ఆధార్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఆ మార్పులు చేసుకోవాల్సిందే !

-

ఆధార్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఆ మార్పులు చేసుకోవాల్సిందేనని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడిఏఐ) పేర్కొంది. ఆధార్ గుర్తింపు కార్డులు పొంది పదేళ్లు దాటిపోయినప్పటికీ కొత్త వివరాలను జోడించని వారు, గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోవాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యుఐడిఏఐ) విజ్ఞప్తి చేసింది.

ఆన్లైన్లో లేదా ఆధార్ కేంద్రాల్లో ఈ ప్రక్రియలు చేపట్టవచ్చు అని సూచించింది. ఇందు కోసం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఇలా అప్డేట్ చేసుకోవడం తప్పనిసరా, కాదా, అన్నదానికి ఈ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆధార్ కార్డు దారులు అలర్ట్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news