BREAKING : ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు

-

ఏపీలోని జగన్మోహన్రెడ్డి సర్కార్ కు ఊహించని షాక్ తగిలింది. సుప్రీం కోర్టు లో.. ఏబీ వెంకటేశ్వరరావు కేసు లో జగన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ రద్దు చేసింది  సుప్రీంకోర్టు. మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు… హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టo చేసింది. సస్పెన్షన్‌ విధించిన రెండేళ్ల తర్వాత కొనసాగింపు కుదరదన్న సుప్రీంకోర్టు… వెంటనే ఏవి వెంకటేశ్వరరావు ను విధుల్లోకి తీసుకోవాలని పేర్కొంది. దీంతో జగన్మోహన్రెడ్డి సర్కార్ కు మరోసారి షాక్ తగిలింది.

Read more RELATED
Recommended to you

Latest news