టీఆర్‌ఎస్ మరో షాక్‌.. విజయగర్జన సభ ఏర్పాట్లను అడ్డుకున్న రైతులు

-

తెలంగాణ రాష్ట్రం లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. నిన్న హుజురాబాద్‌ నియోజక వర్గ కౌంటింగ్‌ లో ఘోర పరాభవం చవిచూసిన.. టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఈ నెలలో విజయ గర్జన సభను టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే… ఈ నేపథ్యంలోనే…ఈ సభ నిర్వహణ కోసం హన్మకొండ జిల్లా లోని హసన్ పర్తి మండలం దేవన్నపేటలో స్థలం పరిశీలించారు అక్కడి స్థానిక టీఆర్ఎస్ నేతలు. ఈ తరుణంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అక్కడి రైతులు షాక్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్ కోసం పంట పండే తమ పొలాలను ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు.

అయితే.. ఎలా ఇవ్వరో మేమూ చూస్తామని టీఆరెస్ నేతలు హెచ్చరించారు. దీంతో రైతులు మరియు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగింది. ఈ తరుణంలోనే సీన్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన బీజేపీ నేతలు.. రైతుల పొలాల్లో అధికార పార్టీ నేతల దౌర్జన్యం ఏంటి అంటూ ఆగహ్రం వ్యక్తం చేస్తారు. టీఆర్‌ఎస్‌ సభ నిర్వహించేదే లేదని హెచ్చరికలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news