బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్.. గోదాం యజమాని అరెస్టు

-

బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనలో గోదాం యజమాని అరెస్టు అయ్యారు.. సర్వన్ ట్రేడర్స్ యజమాని సంపత్ ను అరెస్ట్ చేసిన పోలీసులు…పరారీలో ఉన్న గోదాం కు చెందిన మరో యజమాని సుధాకర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. బోయిగూడ అగ్ని ప్రమాదం పై గాంధీనగర్ పోలీసుల ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

మొత్తం 5 బృందాలతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాద ఘటన పై మొత్తం 60 మందినీ విచారించిన పోలీసులు వారి నుండి స్టేట్ మెంట్ కూడా రికార్డు చేశారు. ఇందులో ప్రత్యక్ష సాక్షులను సైతం విచారించారు పోలీసులు.

11 మంది మృతుల కుటుంబాల నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు… 11 మంది కార్మికులు సజీవ దహనం కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద ఘటనలో తృటిలో తప్పించుకున్న ప్రేమ కుమార్ అపోలో ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగీనట్లు నిర్దారణకు వచ్చిన పోలీసులు… ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news