KATHI MAHESH : కత్తి మహేష్ అంత్యక్రియలలో ట్విస్ట్… ఏమైందంటే ?

-

సినీ విమ‌ర్శకుడు, న‌టుడు అయిన క‌త్తి మ‌హేశ్‌ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెల 26న తన సొంతూరుకు వెళ్ళే నేపథ్యంలో యాక్సిడెంట్ అయింది. అయితే.. ఈ యాక్సిడెంట్ లో తలకు బలమైన గాయాలతో ఆస్పత్రి పాలైన కత్తి మహేష్.. శనివారం సాయంత్రం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇది ఇలా ఉండగా ఇవాళ జరగాల్సిన క‌త్తి మ‌హేశ్‌ అంత్యక్రియలలో ట్విస్ట్ నెలకొంది.

వివరాల్లోకి వెళితే..  కత్తి మహేష్ మృతదేహాన్ని ఇవాళ చెన్నైలోని ఆసుపత్రిలో నుంచి ఆయన సొంత గ్రామం యలమంద తరలిస్తున్నారు. అయితే కత్తి మహేష్ మృతదేహం వచ్చేసరికి… చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది.  దీంతో ఇవ్వాళ ఏర్పాటు చేసిన అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కత్తి మహేష్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని రేపు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కాగా కత్తి మహేష్ కు భార్య ఒక కొడుకు ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు తన భార్యతో కలిసి ఉండటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news