ప్రశ్నించిన వాళ్ళపట్ల బీజేపీ సర్కార్ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తుంది – సంజయ్ సింగ్

-

ప్రశ్నించిన వాళ్ళపట్ల బిజెపి సర్కార్ పిచ్చెక్కినట్లు వ్యవహరిస్తోందన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం విపక్షాలను వేధించాలనే ఉద్దేశ్యంతో కూడినవేనని అన్నారు. మహిళల హక్కుల కోసం 10వ తేదీన దీక్ష చేస్తున్నదనే ఉద్దేశ్యంతోనే నేడు ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు.

విపక్షాలను రూపుమాపేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు తెచ్చుకోవాలన్నారు. ఈడీ, సీబీఐలకు బడ్జెట్ పెంచండని, గల్లీ గల్లీకి బ్రాంచ్ ఓపెన్ చేసి విపక్షాలను అరెస్ట్ చేయండన్నారు. శవాలను కూడా విచారించే నియమాలు తీసుకురండని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, కరెంటు, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ బిజెపి ప్రభుత్వానికి అవసరం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news