జగన్ మీద బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ఆసక్తికర వ్యాఖ్యలు !

-

తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ జగన్ మీద కీలక కామెంట్స్ చేశారు. తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ గతంలో జగన్ సిఎం అయిన సందర్భంగా ఆయనను అభినందిస్తూ ఉన్న ఒక ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసినదే. ఈ ట్వీట్ ను అటు వైసీపీ తో పాటు టీడీపీ సోషల్ మీడియా వింగ్స్ గట్టిగా వాడుతున్నాయి. వైసీపీ ఆమె మాకు మద్దతు పలికే వ్యక్తే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే టీడీపీ కూడా ఆమె కూడా జగన్ తానులో ముక్కేనని ప్రచారం చేస్తున్నారు.

దీంతో తాజాగా ఆమె ఈ అంశం మీద స్పందించారు. తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించి జగన్ సీఎం గా గెలిచినప్పుడు నేను అభినందిస్తూ ట్వీట్ చేసిన మాట వాస్తవం అని పేర్కొన్న ఆమె అలా అభినందిస్తే తప్పేముంది ? అని ప్రశ్నించారు. ఇక ఏపీ నా జన్మభూమి కర్ణాటక నా కర్మభూమి అని, నాకు ఎప్పుడూ నా సొంత రాష్ట్రంలో పని చేయాలని కోరిక ఉండేదని అన్నారు. సొంత రాష్ట్రం మీద అభిమానంతోనే తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news