Big Breaking : నలుగురు TRS ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి స్కెచ్.. ఒక్కో ఎమ్మెల్యే కు 100 కోట్లు ?

-

మునుగోడు ఉపఎన్నికకు ముందు బిజెపి పార్టీ భేరసారాలకు దిగింది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి బిగ్ స్కెచ్ వేసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి, నందకుమార్ లను పోలీసులు పూర్తి సాక్షాలతో పట్టుకున్నారు. మునుగోడులో ఫిరాయింపుల కోసం ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఈ లిస్టులో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఒక్కో ఎమ్మెల్యే కు 100 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ పార్టీ బేర సారాలు చేసినట్లు సమాచారం అందుతుంది. అయితే… టిఆర్ఎస్ ఎమ్మెల్యేల సమాచారం మేరకు పోలీసులు… ఈ మేరసారాలను భగ్నం చేసినట్లు సిపి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. దీనిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news