ఆయన బండి సంజయ్ కాదు… గుండా సంజయ్ – టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

-

తెలంగాణలో మరి ధాన్యం మంటలు ఆగడం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీ పార్టీపై, ఆ పార్టీ అధ్యక్షుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతను బండి సంజయ్ కాదని.. గుండా సంజయ్ అని విమర్శించారు. రైతులపై బందిపోటు దొంగల్లా దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అంటే బురద జల్లే పార్టీగా అభివర్ణించారు. రైతులను తప్పు దారి పట్టించేలా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.jeevan reddy

పశ్చిమ బెంగాల్లో లాగా బీజేపీ గుండాయిజం చేస్తే అక్కడ పట్టిన గతే తెలంగాణలో కూడా బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. యూపీలో రైతులపైకి కార్లు ఎక్కించిన విధంగా తెలంగాణలో కూడా రైతులపై బీజేపీ నాయకులు దండయాత్రం చేస్తున్నారని అన్నారు. బీజేపీ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే మీపై రైతులు పూల వర్షం కురిపిస్తారని లేకపోతే రాళ్ల వర్షమే గతవుతుందన్నారు. ఏడేళ్ల నుంచి జైలుకు పంపుతా అంటున్నావు.. మీలాంటి వాళ్లను చాలామందిని చూశామని, దేశంలో 36 పార్టీలపై ఒత్తడి తీసుకువచ్చి తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన దేవుడు కేసీఆర్ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news