ముంబయిలో సిద్ధార్థ్‌-కియారా రిసెప్షన్‌.. తరలివచ్చిన బీ టౌన్ సెలబ్రిటీలు

-

బాలీవుడ్‌ లవ్ బర్డ్స్ కియారా అడ్వాణీ సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా వీరి కల్యాణ వేడుక జరిగిన విషయం తెలిసిందే.

ఈ బ్యూటిఫుల్ కపుల్ బీ టౌన్ సెలబ్రిటీల కోసం ఆదివారం రోజున ముంబయిలో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ముంబయిలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో రిసెప్షన్‌ ఘనంగా జరిగింది.

సిద్-కియారాల రిసెప్షన్ కు బాలీవుడ్ తారాలోకం తరలివచ్చింది. కరీనా కపూర్, ఆలియా భట్, నీతూ కపూర్, రణ్ వీర్ సింగ్, శిల్పాశెట్టి, దిశా పటానీ, ఆదిత్యారాయ్ కపూర్, వరుణ్ ధావన్-నటాషా దలాల్, కరణ్ జోహార్, కృతిసనన్, భూమి పెడ్నేకర్.. ఇలా బీ టౌన్ తారలంతా తరలివచ్చారు. ఈ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలిపారు.

‘షేర్షా’ సినిమాతో తొలిసారి కలిసి నటించిన కియారా- సిద్ లు ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడిన విషం తెలిసిందే. ఈ విషయాన్ని పెళ్లి సమయం వరకు సీక్రెట్‌గానే ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news