ఆర్‌.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు.. స్పందించిన మంత్రి బొత్స

-

ఏపీ తరుఫున రాజ్యసభకు ఆర్‌.కృష్ణయ్యను వైసీపీ ప్రభుత్వం పెద్దల సభకు పంపనున్న విషయం తెలిసిందే. అయితే.. ఆర్‌.కృష్ణయ్య ఎంపికపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బీసీ నేతలతో త్వరలోనే బస్సు యాత్రను చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపితే తప్పేముందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీసీల సమస్యలను కృష్ణయ్య సమర్థవంతంగా పార్లమెంటులో వినిపిస్తారని చెప్పారు.

Botsa Satyanarayana likely to have sway in N. Andhra

ఒక వ్యక్తి ఎక్కడివాడు అని చూడకూడదని… ఆయన ఎంత సమర్థుడు అనే విషయాన్ని చూడాలని అన్నారు బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య విషయంలో చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు బొత్స సత్యనారాయణ . ఈ కేసులో ఇప్పటికే 302 కేసు నమోదు చేశారని తెలిపారు. కేసును భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని… చట్టం ముందు ఎవరైనా ఒకటేనని చెప్పారు. ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని బొత్స సత్యనారాయణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news