చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క : మంత్రి బొత్స

-

మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే… టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై బొత్స అదే స్థాయిలో స్పందించారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపుమేరలో కనపడదని బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క అని అని మంత్రి బొత్స అభివర్ణించారు.

Visakha Garjana reflected aspirations of North Coastal AP: Botsa  Satyanarayana

చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడడం సమంజసం కాదని, మాజీ సీఎం అయిన వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు వంటి దుష్టశక్తులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స. ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తేలుతుందని బొత్స ధీమా వ్యక్తం చేశారు. “చంద్రబాబు ఎవరితో కలుస్తారో మాకు అనవసరం. మేం ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం. జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెప్పగలుగుతున్నాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం” అని బొత్స స్పష్టం చేశారు

Read more RELATED
Recommended to you

Latest news