అలీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్..!

-

ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహిస్తున్న షో చెఫ్ మంత్రా సీజన్ 2.. ఈ షో కి మంచు లక్ష్మి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ షోలో మాళవిక మోహన్, హీరో మంచు విష్ణు, నిహారిక , రీతు వర్మ, పాయల్ రాజ్ పుత్ లాంటి కొంతమంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ షో. ఇదిలా ఉండగా తాజాగా మరొక ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోన్ విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి బ్రహ్మానందం అలాగే ఆలీలు హాజరయ్యారు. ఈ ప్రోమో ని బట్టి చూస్తే ఈ ఫుల్ ఎపిసోడ్ మరింత వినోద భరితంగా ఉండబోతుందని అర్థమవుతుంది.

ఎందుకంటే ఒకవైపు బ్రహ్మానందం, మరొకవైపు ఆలీ ఇద్దరు ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ షోలో అందరినీ నవ్వించారు. కమెడియన్ బ్రహ్మానందం, ఆలీల కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. కమెడియన్లుగా వీరిద్దరూ కొన్ని వందల సినిమాలలో నటించారు. తాజాగా విడుదల చేసిన షో ప్రోమోలో ముఖ్యంగా బ్రహ్మానందం హావభావాలు, పంచులు, సెటైర్లు ఈ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆయనకు తోడు ఆలీ మెరుపులు కూడా తోడయ్యాయి. మంచు లక్ష్మి అడిగే ప్రశ్నలకు వీరిద్దరూ వారి స్టైల్ లో సమాధానాలు చెప్పి ప్రేక్షకులను విపరీతంగా అలరించారు. ఆ ప్రోమోలో మంచి లక్ష్మి అలీ గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటి ? అని ప్రశ్నించగా వెంటనే బ్రహ్మానందం.. మనిషిని తప్ప అన్ని తింటాడు .. అంటూ సెటైర్ వేశారు. ఆ మాటకు మంచు లక్ష్మీ తో పాటు అక్కడ ఉన్న వారంతా కడుపుబ్బ నవ్వారు..

ఆ తర్వాత బ్రహ్మానందం , అలీ ఇద్దరు కలిసి ఒక వంట చేశారు. మధ్య మధ్యలో పంచులు వేస్తూ అందర్నీ కడుపుబ్బా నవ్వించారు. బోటి కూర, లివర్ కూర, తలకాయ కూర అని లక్ష్మీ చెబుతుంటే ..మధ్యలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. తలకాయ కూర ఎవరు తింటారు.. తలకాయ లేనోళ్లు తింటారు.. అంటూ పంచులు వేశాడు. ఆద్యంతం ఈ ప్రోమో నెటిజెన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news