BREAKING: 12 వ రౌండ్ లోను జోరుమీదున్న కారు..

-

మునుగోడు ఊప ఎన్నిక ఫలితాలు వన్ సైడ్ గా కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్ నుండి 12 రౌండ్ వరకు టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మునుగోడులో ఆదిక్యం కొనసాగిస్తుంది. మూడు రౌండ్లు మినహా అన్ని రౌండ్లు లోను టిఆర్ఎస్ ముందంజలో ఉంది. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ ఆదిక్యంలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. మునుగోడు బైపోల్ 12వ రౌండ్ లో కూడా కారు పార్టీ అధికారంలో నిలిచింది. 12వ రౌండ్ ముగిసే సమయానికి 8000 ఓట్ల మెజారిటీలో టిఆర్ఎస్ ముందుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయం దిశగా అవకాశం రాలేదు. టిఆర్ఎస్ గెలుపు దాదాపు ఖాయమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version