బ్రేకింగ్; అమరావతిలో ఇద్దరు ఆత్మహత్య…!

-

సరదాలు ప్రాణం తీస్తూ ఉంటాయి అనేది చాలా సార్లు రుజువు అయిన అంశం. ఈ విషయంలో చాలా మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా సీరియస్ విషయాల్లో సరదా అనేది అంత మంచిది కాదు. స్నేహితుల దగ్గర కూర్చున్నప్పుడు అన్నీ సరదాగా కూడా తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. తాజాగా ఇలాగే జరిగిన ఒక సరదా ఘటన ఇద్దరి ప్రాణాలు తీసింది.

ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి మధ్యంలో మందు కలుపుకుంటే మరో వ్యక్తి వినకుండా తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటు చేసుకుని కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం, వెంకటపాలెంలో పులి హరిబాబు అనే వ్యక్తి మనస్తాపంతో మధ్యంలో పురుగుల మందు కలుపుకున్నాడు.

తనకు కూడా మద్యం కావాలని దాసరి వందనం అడిగాడు. మధ్యంలో పురుగుల మందు కలిపి ఉందని చెప్పగా సరదాగా తీసుకున్నాడు వందనం. హరిబాబు దగ్గరి నుంచి మద్యం లాక్కుని తాగాడు. అప్పటికే మందు కలిపిన మద్యం హరిబాబు తాగి ఉన్నాడు. దీనితో ఇద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు హరిబాబు ఎందుకు మనస్తాపం చెందాడు అనేది స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news