పన్నెండు మెట్ల కిన్నెర వాద్యకారుడు మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పలువురికి ఇళ్ల స్థలాలు కేటాయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మేరకు పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత దర్శనం మొగిలయ్యకు కూడా హైదరాబాద్‌లో ఇంటి స్థలం పత్రాలను అధికారులు అందజేశారు. ఈ విషయం తనకు చెప్పకుండానే మొగిలయ్యకు ఇంటి స్థలం పంపిణీ చేశారని నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అసహనం వ్యక్తం చేశారు.

స్థానిక శాసనసభ్యుడిగా స్థలం పంపిణీ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వలేదని గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాతి, ఖ్యాతిని జాతీయ.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కొందరికి జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో స్థలాలు ఇచ్చారన్న బాలరాజు.. మొగిలయ్యకు మాత్రం బీఎన్‌రెడ్డి నగర్‌లో స్థలం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news