బిఆర్ఎస్ నేతలు దాడులను నమ్ముకున్నారు – మాణిక్ రావు థాక్రె

-

కాంగ్రెస్ యువ నాయకుడి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్ రావు థాక్రె. ఇలాంటి దాడులు దురదృష్టకరం అన్నారు. బీఆర్ఎస్ నేతలు దాడులను నమ్ముకొని ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ యువ నాయకున్ని చంపాలని చూసారని ఆరోపించారు. అతడు చనిపోయాడని అనుకొని వెళ్ళిపోయారని.. పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

అసలు దొశులేవరో అందరికీ తెలుసన్నారు మాణిక్ రావు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఎవరు ప్రశ్నించొద్దని అనుకుంటోందని.. తమ తప్పులను, అక్రమాలను ప్రశ్నించొద్దని దాడులకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దాడులను తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పేదప్రజలకు న్యాయం అందాలని, రాష్ట్రం అభివృద్ది చెందాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని.. కానీ ఇంతటి దుర్మార్గ పాలన నడుస్తుందని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్ చర్యలను ప్రజలు గమనించాలని కోరారు. అన్యాయాలు, అత్యాచారాలు తెలంగాణలో పెరిగిపోయాయయన్నారు.యువత ఆందోళన వదలాలని, వారికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news