క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..బుమ్రా ఇజ్ బ్యాక్

-

టీమిండియా ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌. టీం ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎట్టకేలకు తిరిగి ఫిట్నెస్ సాధించాడు. గత ఏడాది గాయాల కారణంగా టి20 సిరీస్ లకు దూరంగా ఉన్న బుమ్రా, శ్రీలంకతో వన్డేలకు భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఇప్పటికే ప్రకటించిన జట్టులో అతను లేడు.

బూమ్రా ఫిట్నెస్ మీద సందేహాలతో సెలెక్టరు అతన్ని లంకతో టి20 లకే కాక వన్డేలకు దూరం పెట్టారు. అయితే బుమ్రా పూర్తిగా కోలుకున్నట్లు నిర్ధారిస్తూ జాతీయ క్రికెట్ అకాడమీ పచ్చ జెండా ఊపడంతో ఈ నెల 10న ఆరంభమయ్యే 3 వన్డేల సిరిస్ కు అతన్ని జట్టులోకి ఎంపిక చేశారు. గత ఏడాది గాయం కారణంగా కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉన్న బుమ్రా, సెప్టెంబర్ లో పునరాగవనం చేశాడు. కానీ కొన్ని రోజుల్లోనే మళ్లీ గాయపడి టి20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news