పరేడ్ తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందే – హైకోర్ట్

-

రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యటితో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందేనని ఆదేశించింది హైకోర్టు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదని.. రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడం లేదంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. పరేడ్ తో కూడిన రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది.

అయితే ఎక్కడ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించాలని స్పష్టం చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలు జరగాలని దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు 1950 నుండి జరుగుతున్నాయని గుర్తు చేసింది. కాగా కరోనా వల్ల పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు నిర్వహించలేమని, రాజ్ భవన్ లో జరుపుకోవాలంటూ గవర్నర్ కు ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news