టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో ఖాళీలు వున్నాయి. మహారాష్ట్ర లోని తారాపూర్ కేంద్రంలో ఉన్న ఈ ఖాళీలని భర్తీ చేయనున్నారు.

దీనిలో మొత్తం 193 ఖాళీలు వున్నాయి. ఇక ఎవరు ఈ పోస్టులకి అర్హులన్నది చూస్తే.. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే పదో తరగతి లేదా సంబంధిత విభాగం లో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక ఎలా ఎంపిక చేస్తారన్నది చూస్తే.. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలానే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇలా వీటి ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకి అప్లై చెయ్యాలంటే 28-02-2023 దాకా అవకాశం ఉంది. కనుక ఆలోగా అప్లై చేసుకోవడం మంచిది.

ఇక పోస్టుల వివరాలని చూస్తే..

స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్ (158)
నర్సు-ఎ (మేల్‌/ ఫిమేల్‌) (26)
పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ (సైంటిఫిక్ అసిస్టెంట్/ బి) (3)
ఫార్మసిస్ట్/ బి (4)
స్టైపెండరీ ట్రైనీ/ డెంటల్ టెక్నీషియన్ (మెకానిక్) (1)
ఎక్స్-రే టెక్నీషియన్/ సి (1)

పూర్తి వివరాలని https://npcilcareers.co.in/TMS20232202/candidate/Default.aspx లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news