హమ్మయ్య.. 33 వస్తువులపై జీఎస్టీ తగ్గించిన కేంద్రం..

-


కేంద్ర ప్రభుత్వం ఇంతకాలానికి కొన్ని వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌‌లో భేటీ అయిన జీఎస్టీ మండలి 33 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 7 రకాల వస్తువులపై పన్నులను 28 నుంచి 18 శాతానికి.. మరో 26 వస్తువులపై 18 నుంచి 12 శాతం, 5 శాతానికి తగ్గించింది. దీంతో ఏసీలు, డిష్‌వాషర్స్‌, టీవీలు, డిజిటల్‌ కెమెరా, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు మరింత తగ్గనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం కొన్ని వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ మోదీ ఉద్దేశించి … గాఢ నిద్ర నుంచి మోడీని లేపాము అంటూ వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన ఎలక్షన్లలో భాజపాకి వ్యతిరేక పవనాలు వీయడంతో గతంలో తీసుకున్న నిర్ణయాలను మరోసారి మార్చుకుంటున్నట్లు సర్వత్రా చర్చనీయాంశ మైంది.

Read more RELATED
Recommended to you

Latest news