జ‌గ‌న్ స‌ర్కార్ కు కేంద్రం మ‌రోషాక్‌.. పోల‌వ‌రం నిధుల‌పై ప్ర‌క‌ట‌న‌

-

పోలవరం ప్రాజెక్టు నేప‌థ్యంలో… జ‌గ‌న్ స‌ర్కార్ కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో షాక్ ఇచ్చింది. నీటి పారుదల పనులకు మాత్రమే నిధులు ఇస్తామ‌ని కేంద్రం ప్ర‌క‌ట‌న చేసింది. రాజ్యసభలో పోల‌వ‌రంపై వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి జవాబు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగానికి మాత్రమే నిధులు కేటాయించబోతున్నట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి
బిశ్వేశ్వర్‌ తుడు సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.

2017-18 ధరల ప్రాతిపదికపై పోలవరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి రెండవసారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55,548 కోట్లను 2019 ఫిబ్రవరిలో జరిగిన సలహా సంఘం సమావేశం ఆమోదించినట్లు తెలిపారు. తదుపరి దీనిని పరిశీలించిన “రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ” సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్‌ విభాగానికి అయ్యే ఖర్చు మొత్తం 35,950 కోట్లకు మాత్రమే ఆమోదం తెలుపుతూ మార్చి 2020న నివేదికను సమర్పించింది.

దీనిపై పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 2014 ఏప్రిల్‌ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని నూరు శాతం భరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తదనుగుణంగా పోలవరం పనుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుకు సంబంధించిన బిల్లులను పీపీఏ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) పరిశీలించి, సిఫార్సు చేసిన మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి రీయంబర్స్‌ చేస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version