ఎస్పీబీ ప్రస్థానం ఒక స్వర్ణయుగం : చంద్రబాబు

-

గత సంవత్సరం సంగీత లోకాన్ని చీకటి చేసి.. అంతనంత దూరంగా వెళ్లిపోయారు గానగంధర్వుడు ఎస్పీబీ.. నేడు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి. గతేడాది ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం కరోనా అనంతర సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతీయ సినీ పరిశ్రమ, ఆయనతో అనుబంధం ఉన్నవారు, అభిమానులు జయంతి సందర్భంగా ఆ మహోన్నత కళాకారుడ్ని స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియాలో స్పందించారు.

Andhra CM Chandrababu Naidu biggest loser in Maha Kootami decimation -  Hindustan Times

సినీ సంగీత చరిత్రలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రస్థానం ఒక స్వర్ణయుగం అని చంద్రబాబు కొనియాడారు. ఎన్నో అజరామరమైన పాటలను ఆలపించి ఆబాల గోపాలాన్ని మంత్రముగ్ధులను చేశారని కీర్తించారు. ఆ మధుర గాయకుని జయంతి సందర్భంగా ఆయన కళారంగ సేవలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news