ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను ఫోన్ లో పరామర్శించిన చంద్రబాబు

-

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కారులో మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవమై కనిపించడం తీవ్ర కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నేడు స్వగ్రామం గొల్లలమామిడాడ లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ ను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించారు. అపర్ణకు టిడిపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులకు శిక్ష పడే వరకు టిడిపి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

బహిరంగం గా తిరుగుతున్న ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్రమణ్యం మృతి పై మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు అనంత బాబు బినామీ అని అన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య పై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి నుంచి మైనింగ్ వరకు అనంత బాబు అనేక అక్రమాలు చేస్తున్నాడని హర్ష కుమార్ ఆరోపించారు. అక్రమాలు బయటపడతాయనే అతడిని హత్య చేశాడని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news