జగన్ ద్రోహం చేశారు..!

-

కరోనా వైరస్ సంక్షోభం సమయంలో టిడిపి నేతలందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు అందరికీ దిశానిర్దేశం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే 175 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జ్ లు ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రజలను నమ్మించి మోసం చేయడంలో జగన్మోహన్రెడ్డి తర్వాతే ఎవరైనా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు. అమరావతి అభివృద్ధి పనులు ఆపే యడం మొదటి ద్రోహం అయితే పోలవరం ప్రాజెక్టు పనులు ఆపే యడం రెండవ ద్రోహం.. ప్రత్యేక హోదా తెప్పిస్తాను అని నమ్మించి ప్రజలందరినీ మోసం చేయడం మూడవ ద్రోహం అని ఇలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రజలకు సీఎం జగన్ మూడు రకాల ద్రోహాలు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news