ఆత్మవంచనకు కూడా ఒక లిమిట్ ఉంటుంది బాబు!!

-

2019 ఎన్నికల్లో వైకాపాకు 151 సీట్లు వచ్చాయి.. టీడీపీ 23 రావడం ఆ సంఖ్య ప్రస్తుతం 21 దగ్గర ఆగడం తెలిసిందే. ఈ క్రమంలో వైకాపా ఎంత బలంగా ఉందో ప్రత్యెకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో జగన్ పాలన కూడా సామాన్యుడికి అత్యంత చేరువగా వెళ్తూ ప్రశంసలు పొందుతున్న పరిస్థితి! ఈ పరిస్థితుల్లో మరో రెండేళ్లలో ముందస్తు ఎన్నికలు వైకాపా పరిస్థితి ఏమిటి? 23 నుంచి 21 కి వచ్చిన టీడీపీ పరిస్థితి ఏమిటి అన్నది తనదైన శైలిలో చెప్పుకొస్తున్నారు చంద్రబాబు!

అవును… తనను తాను మోసం చేసుకుంటున్నారో లేక కార్యకర్తలకు, నాయకులకు మనోధైర్యాన్ని ప్రసాదించే క్రమంలో ఇలా మాట్లాడుతున్నారో తెలియదు కానీ.. ప్రస్తుతం జూం వేదిక ద్వారా నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు చంద్రబాబు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. మరో రెండేళ్లలో ముందస్తు ఎన్నికలు వచ్చినా, జమిలి ఎన్నికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వం పని అయిపోతుంది.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పుకొస్తున్నారు చంద్రబాబు!

ఈ మాటలు విన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులే పెదవి విరుస్తూ… మనం ఏమి చేశామని గెలుస్తాం.. వైకాపా ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందని ఓడుతుందనే కామెంట్లు చేస్తున్నారు. వైకాపా పార్టీ పరంగాను, ప్రభుత్వ పరంగానూ ఎంతో బలంగా ఉన్న విషయం బాబుకి బాగా తెలుసు. తామెంత బలహీనంగా ఉన్నదీ వారికి బాగా తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరిని ఏమార్చడానికి బాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీటికి సమాధానంగానే.. బాబువి పగటి కలలా… ఆత్మవంచన మాటలా… అని తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news