పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడానికి వైసిపి చేస్తున్న కుట్రలు దుర్మార్గం – చంద్రబాబు

-

జనసేన నాయకుల అరెస్ట్‌ పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. విశాఖలో వైసిపి ప్రభుత్వం అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు చంద్రబాబు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గారి జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వైసిపి చేస్తున్న కుట్రలు దుర్మార్గమని ఆగ్రహించారు.

ఆయన బస చేస్తున్న హోటల్ లో సోదాలు నిర్వహించడం, నాయకులను బెదిరించడం నియంత పాలనకు నిదర్శనమని వెల్లడించారు. విశాఖ ఎయిర్ పోర్ట్ ఘటన పేరుతో పదుల సంఖ్యలో అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు.

ర్యాలీకి అనుమతి అడిగిన నేతలపై హత్యాహత్నం సెక్షన్ ల కింద కేసులు పెట్టి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒక పార్టీ అధినేత కారులో కూర్చోవాలో.. బయటకు వచ్చి అభివాదం చెయ్యాలో కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అని ప్రశ్నించారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news