రైతులకు సీఎం జగన్ శుభవార్త..రేపే రైతు భరోసా నిధులు విడుదల

-

రైతులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు.రేపే రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. ఇందులో భాగంగానే.. రేపు సీఎం వైయస్‌ జగన్‌ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ పర్యటించనున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో రేపు జగన్‌ పాల్గొంటారు.

ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. 10.15 గంటలకు ఆళ్ళగడ్డ చేరుకోనున్నారు. 10.45 – 12.10 గంటలకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి జగన్. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ రెండో విడత నగదు బదిలీని వర్చువల్ గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news