చంద్రబాబు తన నివాసం ఏపీకి మార్చుకోవాలి – GVL

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేసేవాళ్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని డిమాండ్ చేశారు బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు వెంటనే తన నివాసాన్ని ఏపీకి మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు లకు హైదరాబాద్ మీద ఉన్న ప్రేమ ఏపీ రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు. ఈ ఇద్దరు నాయకులు హైదరాబాద్ వదిలి ఏపీలో శాశ్వత చిరునామాలు ఏర్పాటు చేసుకున్నప్పుడే రాష్ట్ర ప్రజలకు విశ్వాసం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఐటి ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం లో ఉన్నారని అన్నారు. ఐటీ ఉద్యోగులందరినీ విశాఖలోని పనిచేసే విధంగా ఐటీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జలపాలని సూచించారు. దీనికి మంత్రి అమర్నాథ్ బాధ్యత తీసుకోవాలని సూచించారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

Read more RELATED
Recommended to you

Latest news