ఒక్కో రైతు నెత్తిమీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్దా? – వైఎస్ షర్మిల

-

బిఆర్ఎస్ సర్కార్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్దా? అని ప్రశ్నించారు. కెసిఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వైఎస్ షర్మిల.

“అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఏంటో జర చెప్పండి BRS కేసీఆర్ గారు?దేశంలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థానంలో పెట్టడం రైతుకు భరోసానా? ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా? 37లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం మీ BRS నినాదమా..? 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కిసాన్ సర్కార్ అంటారా? సబ్సిడీ పథకాలను బంద్ పెడితే రైతు సంక్షేమ ప్రభుత్వమా? ఒక చేత్తో రైతుబంధు ఇచ్చి.. మరో చేత్తో వెనక్కి తీసుకోవడం రైతును ఆదుకున్నట్లా? ఉచిత ఎరువులు అని చెప్పి పంగనామాలు పెట్టడం, బ్యాంకుల ఎదుట రైతులను మోసగాళ్లను చేయడం.

పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం.. ఇదేనా “అబ్ కీ బార్ కిసాన్” సర్కార్! మీది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. “ఆప్ కి బర్బాత్ సర్కార్”. కన్న తల్లికి అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. ఈ బంగారు గాజుల లెక్కనే ఉన్నది దొర కేసీఆర్ తీరు..! ఇక్కడ రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు,పంటకు గిట్టుబాటు ధర రాదు, రుణమాఫీ జాడ లేదు, కౌలు రైతుకు దిక్కేలేదు. రైతును అప్పుల పాలు చేసి కోటీశ్వరులు చేశానని చెప్పే నీ బర్బాత్ సర్కార్ మాటలు నమ్మే రోజులు పోయాయి. ఇక్కడి రైతులను ఆదుకోని కమీషన్ రావు దేశాన్ని ఉద్దరిస్తాడట” అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news