నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన

-

నేడు విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.  విశాఖ జిల్లా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా భోగాపురం లోని సన్ రే రిసార్ట్స్ కు చేరుకున్న చంద్రబాబు.. నేడు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఉదయం 8 గంటల నుంచి నెల్లిమర్ల, చీపురుపల్లి వంటి నియోజకవర్గాల నేతలతో సమీక్షిస్తారు.

నారా చంద్రబాబు నాయుడు
నారా చంద్రబాబు నాయుడు

అనంతరం 11 గంటలకు భోగాపురం మండలం లోని సన్‌రే రిసార్ట్స్‌ నుంచి భోగాపురం, నాతవలస, డెంకాడ, విజయనగరం పట్టణంలోని దాసన్నపేట జంక్షన్ మీదుగా నెల్లిమర్ల మండలం రామతీర్ధం జంక్షన్ చేరుకుంటారు. 3 గంటలకు నెల్లిమర్ల నుంచి బయల్దేరి 3.15 గంటలకు గుర్ల మండల కేంద్రానికి చేరుకుని 3.15 నుంచి 4 గంటల వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.4.20 నిమిషాలకు గుర్ల మండలం పెనుబర్తి కూడలికి చేరుకుంటారు.

4.45 నిమిషాల వరకు అక్కడే ఉన్న తోటపల్లి కాల్వలను పరిశీలిస్తారు.అనంతరం 5 గంటలకు గుర్ల మండల కేంద్రానికి చేరుకుంటారు.ఇక్కడ 5.45 వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.6 గంటలకు చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 6.45 వరకు రోడ్‌షో లో ప్రసంగిస్తారు.అనంతరం రాత్రి 7గంటలకు చీపురుపల్లి నుంచి బయలుదేరి 9గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news