చంద్రబాబుది తప్పుడు ప్రచారం – బుగ్గన

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎప్పుడు అవాస్తవాలను ప్రచారం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో మంత్రి బుగ్గన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ దాడులు లేవని, అక్రమ కేసులు నమోదు కాలేదు అన్నారు. 2019 నుండి రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news