రాయలసీమ వాసులకు గుడ్ న్యూస్.. హై కోర్టు బెంచ్ పై చంద్రబాబు కీలక ప్రకటన

-

రాయలసీమ వాసులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ పై ఆయన తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇవాళ సచివాలయంలో జరిగిన న్యాయ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. రాయలసీమలో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు సీఎం చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 100 ఎకరాలలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడేవిధంగా విచారణ ఉండాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు. మరోవైపు ముస్లిం, మైనార్టీలకు గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకొని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version