మహానంది క్షేత్రంలో డ్రోన్ కెమెరాల కలకలం !

-

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది క్షేత్రంలో డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. అనుమతి లేకుండా ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరించాడు ఓ అగంతకుడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆగంతకుని వాహనాన్ని కారులో ఆరు కిలోమీటర్ల వరకు చేజింగ్ చేశారు ఈవో చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది. ఆలయ అధికారుల వాహనాన్ని సరిగా గుర్తించకపోవడంతో ఆగంతకుడు తప్పించుకున్నాడు.

సీసీ ఫుటేజ్ లో సైతం ఆగంతకుని దృశ్యాలు కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. విచారణ చేపడుతున్నామని తెలిపారు ఎస్సై నాగార్జున రెడ్డి. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news