Breaking : హైదరాబాద్‌కు చేరుకున్న చేగువేరా కూతురు డాక్టర్ అలైదా

-

విప్లప యోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా కలకత్తా నుండి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తే ఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆహ్వానం పలికారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభలో అలైదా గువేరా, ఎస్తే ఫానియా ముఖ్యఅతిధులుగా పాల్గొననున్నారు. ఈ సభలో బీజేపీ, ఎంఐఎం మినహా మిగతా పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొనున్నట్టు సమాచారం.

ఈ సభను విజయవంతం చేయాలని క్యూబా తెలంగాణ కమిటీ కోఆర్డినేటర్లు బాలమల్లేష్, నరసింహారావులతో జాతీయ సంఘీభావ కమిటీ పిలుపునిచ్చారు. గురువారం మగ్ధుం భవన్‌లో ‘క్యూబా సంఘీభావ సభ’ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా సభను విజయవంతం చేయాలని, చేగువేరా కుమార్తె, మనవరాలికి ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానించాలని నిర్ణయించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా అలైదా, ఎస్తెఫానియా సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దుంభవన్‌కు వెళ్లనున్నారు. వీరి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభ జరిగే రవీంద్రభారతి వద్ద పలుచోట్ల ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి. చేగువేరా ఫ్లెక్సీలతో పాటు ఆయన కూతురు, మనవరాలికి స్వాగతం పలుకుతూ భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news