జగన్‌ను కలిసే ముందు.. పవన్ తో భేటీ అయిన చిరంజీవి..

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నేటి మధ్యాహ్నం భేటీ కానున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ఏపీలో హాట్‌గా హాట్‌గా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. అయితే ఈ కలయిక మర్యాద పూర్వకమేనని, ఎటువంటి రాజకీయ కారణాలు లేవని అటు సీఎంఓ అధికారులు, ఇటు చిరంజీవి సన్నిహితులు చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో చిరు వెళ్లి జగన్‌ను భేటీ కావడం పవన్ కల్యాణ్‌కు నచ్చడం లేదనే ప్రచారం కూడా జరుగుతుంది.

అయితే విజయవాడలో జ‌గ‌న్ క‌ల‌వ‌డానికి ముందు.. చిరంజీవి దంపతులు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఇది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్‌ను కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి, ఎలాంటి విషయాలపై చర్చించాలనే విషయంపై ముందు తమ్ముడుతో భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైన చిరంజీవి అభిమానుల‌ మనోభావాలను గుర్తించి ముందు తమ్ముడినే క‌ల‌వ‌డంతో.. మెగా అభిమానుల‌కు కాస్త ఊరట చెందార‌ని చెప్పాలి.

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర నుండి బ‌య‌లుదేరిన చిరంజీవి దంప‌తులు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి, ఆయన భార్య సురేఖను సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఇక జగన్మోహన్ రెడ్డితోనే చిరు దంపతులు, రామ్ చరణ్ లంచ్ చేయనున్నారు. కాగా చిరు, పవన్ భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చల‌కు దారితీస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news