ఢిల్లీకి చేరుకున్న చిరంజీవి.. మోదీ, అమిత్ షాలతో భేటీ..

-

‘సైరా’ సినిమా స‌క్సెస్‌తో చిరంజీవి మంచి జోష్ మీదు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలసి తన సినిమాను వీక్షించడానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అలాగే తమిళనాడు గవర్నర్ తమిళిసై కూడా ఈ చిత్రాన్ని చూసి, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చిరంజీవి కలవబోతున్నారు.

చిరంజీవి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. తొలుత ప్రధాని మోదీని కలిసి ‘సైరా’ సినిమాను చూడాల్సిందిగా కోరనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. కాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన చిరంజీవి కేంద్ర పెద్దల కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో సైరా సినిమా ప్రత్యేక షో ప్రదర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news