ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ?

-

తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ల విష‌యంలో సంతృప్తి చెంద‌ని టాలీవుడ్ హీరోలు ఇప్పుడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి సిద్ధం గా ఉన్నార‌ని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో టికెట్ల ధ‌ర‌ల పెంపు లో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారు. సినిమాటోగ్ర‌ఫి మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తో పాటు ఎంపీ సంతోష్ కుమార్ తో చ‌ర్చ‌లు జ‌రిపి సీఎం కేసీఆర్ ద‌గ్గ‌రికి తీసుకెళ్లి ధ‌ర‌లు పెంచారు. కాగ ఇప్పుడు ఆంధ్ర ప్ర‌దేశ్ లోనూ మెగాస్టార్ చిరంజీవి కీల‌క అడుగు వేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఏపీ ముఖ్య మంత్రి జ‌గ‌న్ తో స‌మావేశం కావ‌డానికి మెగాస్టార్ చిరంజీవి అపాయింట్ మెంట్ కూడా తీసుకున్న‌ట్టు తెలుస్తుంది.

ఏపీ మంత్రి పేర్ని నాని స‌హకారంతో సీఎం జ‌గ‌న్ తో స‌మావేశం కానున్నాడ‌ని తెలుస్తుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం సినిమా టికెట్ల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యం పై చ‌ర్చించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లువురు హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మ‌త‌లు న‌టీనటులు సినిమా టికెట్ల విష‌యంలో కామెంట్స్ చేసినా ఏపీ ప్ర‌భుత్వంలో చ‌ల‌న లేక‌పోవ‌డంతో మెగా స్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నాడ‌ని స‌మాచారం. అయితే మెగా స్టార్ చిరంజీవి ఆంధ్ర ప్ర‌దేశ్ లో సినిమా టికెట్ల గొడ‌వను ప‌రిష్క‌రిస్తాడా లేదా చూడాలి మ‌రి.

Read more RELATED
Recommended to you

Latest news