చిరు బాలయ్య సినిమాలపై బెట్టింగ్ స్టార్ట్ చేసిన ఫ్యాన్స్..!!

-

సంక్రాంతి పండుగ తెలుగు ప్రాంతాలలో భారీ ఎత్తున జరిగే పెద్ద పండుగ. అప్పుడు జనాలు కోళ్ల పందాలతో మంచి జోష్ లో వుంటారు. అప్పుడే మన హీరోల సినిమాలు కూడా పందెం కోళ్ళులా తలపడతాయి. అందుకే చాలా మంది షూటింగ్ త్వరగా పూర్తి చేసి సంక్రాంతి బరిలో వుండాలని కోరుకుంటారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి మరియు బాలయ్య కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు.

కే ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్  దశలో వుంది.ఈ సినిమాను  సంక్రాంతి కి రిలీజ్ చేస్తున్నారు. అలాగే  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీర సింహ రెడ్డి సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు బాలయ్య కూడా సంక్రాంతి 12 తేదీన వస్తున్నానని మీసం మెలేసి చెప్పాడు. ఇక చిరంజీవి తేది మైత్రీ వారు ఇంకా రివెల్ చేయలేదు. 13 తేదీ న  బరిలో  దిగుతారని ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు ఇక దిల్ రాజు సినిమా వారసుడుగా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధంగా వుంది.

అయితే తెలుగు రాష్ట్రాలలో బాలయ్య, చిరంజీవి మధ్య మాత్రమే బిగ్ ఫైట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్ లో అభిమానుల మధ్య విపరీత మైన పోటీ నడుస్తోంది. ఇక చిరు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య, ఎన్ని థియేటర్స్ వస్తాయి, మొదటి రోజు కలక్షన్స్, టోటల్ ఎంత వసూలు చేస్తుంది అనే విషయాలపై ఇప్పటి నుండే బెట్టింగులు స్టార్ట్ అయ్యాయట.ఇక సినిమా కటౌట్ హైట్ గురించి ఎవరిది ఎంత ఎత్తు అని కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల రోజున టిక్కెట్స్ గురించి, హడావుడి గురించి ఇప్పుడే బడ్జెట్ వేస్తున్నారట. చూస్తూంటే సినిమా విడుదల కాకుండా యుద్దం జరిగేలా ఉందని చూసిన వారు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news