షర్మిల అరెస్ట్ పై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ !

-

ఇటీవల వైఎస్‌ షర్మిలను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటన పై ఏపీ సర్కార్‌ తరఫున కాకుండా, వ్యక్తిగతం గా మాత్రం సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అయితే, జగన్‌ మాత్రం స్పందించడం లేదని.. సోషల్ మీడియాలో టీడీపీ చురకలు అంటిస్తోంది. అయితే, ఈ సంఘటనపై స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

అరే…! అసలక్కడ మూడో వ్యక్తే లేరు. పచ్చ కుల మీడియా గాలి పోగేసి వార్తలు రాస్తోందని చెప్పేందుకు ఇదో మచ్చుతునక. తెలుగు ప్రజలకు పట్టిన ఈ దరిద్రం 2024తో వదిలిపోతుందంటూ ఎల్లో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.

రేపు ఆ కుల పేపర్లు, ఛానళ్లు చూడ్డానికి గుండె నిబ్బరం అవసరం. అఖిలపక్ష G-20 సదస్సులో ఎలాగైనా మోడీగారి చేయి పట్టుకుని ఫోటో దిగి “పీఎం-చంద్రం భేటీ – ఢిల్లీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు” అని డ్రామోజీ, విగ్గు రాజు, tv5 నాయుడు హోరెత్తిస్తారు. వీళ్ళను మెంటల్ డాక్టర్ కు చూపించాల్సిందేనని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news