స్వర్ణాంధ్ర 2047 సంకల్పంలో భాగంగా కూటమి ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తోంది. అయితే నెల నెలా ఒక్కో థీమ్ ను ఎంచుకుంటోంది. ఈ సారి ఈ వ్యర్థాల సేకరణ, వాటిని సురక్సిత పద్దతుల్లో రీసైకిల్ చేయడం థీమ్ ను ఎంచుకుంది. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కేంద్రాల నిర్వహణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని SHG సభ్యులను గుర్తించాలని వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్ అనేది E-వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో భాగస్వాములు స్వాములు కావాలని ప్రతీ ఒక్కరినీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.