వైవీ రావు మృతి.. జగన్ సంతాపం

-

ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు మృతి చెందారు. గుండెపోటుతో ఆయన కన్నుమూశాడు. గొల్లపూడిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపాన్ని తెలియజేశారు. వైవీ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.

వైవీ రావు మృతి పట్ల ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రావు, ఇతర నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వైవీ రావు మృతి ఎంతో బాధాకరమని ఆర్టీసీ ఎన్​ఎంయూ, ఆర్టీసీ ఎస్​డబ్ల్యూఎఫ్, కార్మిక పరిషత్, ఇతర సంఘాల నేతలు, ఆర్టీసీ అధికారులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. వైవీ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. కాగా ఈ మధ్యనే ఆయన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ఓ చర్చలో పాల్గొన్నారు. ఆర్టీసీని.. ప్రభుత్వంలో విలీనం చేయడం వలన ఎటువంటి సమస్యలు ప్రస్తుతం వస్తున్నాయో తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల సమస్యలపై మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా.. ఉద్యోగులు సంతోషంగా లేరని.. ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news