జగన్ కొబ్బరికాయ కొట్టడానికి రాళ్లు ఎత్తిన పూజారులు…వీడియో వైరల్

-

కడప సున్నపురాళ్ళ పల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌కు నిన్న భూమి పూజ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే… ఈ కార్యక్రమం నేపథ్యంలో సీఎం జగన్‌ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. మనం అందరం కొబ్బరికాయ కొట్టేట్టపుడు వంగి కొడతాం. కానీ, ఏపీ సీఎం జగన్‌ మాత్రం.. నిలబడే కొబ్బరికాయ కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో…ఈ విషయం వివాదంగా మారింది.

కాగా ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందన్నారు. గతంలో వైఎస్ ఎన్నో కలలు కన్నారు.. అనాడు స్టీల్ ప్లాంట్ కోసం పరితపించారు.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించు కాలేదు.. దేవుడి దయవల్ల నేడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతోందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు, 36 నెలల్లో 3300 కోట్లతో మొదటి దశ.. మరో ఐదేళ్లలో మొత్తం పరిశ్రమ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. మూడు మిలియన్ టన్నులతో కాదు ఇంకా పెరుగుతుందని, ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డామన్నారు. మంచి రోజులు వచ్చాయని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. దేవుడి దయతో వైఎస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్‌. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారు. వైఎస్సార్‌ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news