మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడు దొంగలు – సీఎం జగన్

-

మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడు దొంగలు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా? అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందాన అంటాడన్నారు. పరిహారం అందని ఒక్క కౌలు రైతునైనా చంద్రబాబు, దత్తపుత్రుడు చూపించలేకపోయారు.

నేను సవాల్‌ చేసినా.. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు స్పందించలేదని విమర్శించారు వైఎస్ జగన్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు ఏకమై ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చేస్తారని ఆగ్రహించారు వైఎస్ జగన్.

మూడేళ్లలో రైతుల కోసం ప్రభుత్వం రూ.1.28 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను పరిశీలిస్తున్నారు. అవినీతి పూర్తిగా నిర్మూలిస్తున్నామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.7 లక్షల సాయం అందిస్తున్నామన్నారు. అయితే కోనసీమలో క్రాప్ హాలిడే పేరుతో కొందరు వ్యక్తులు రైతులను రెచ్చగొడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news