ఈనెల 16న సీఎం జ‌గ‌న్ పర్యటన ఫిక్స్.. !

-

ఈనెల 16న ఏపీ సీఎం జ‌గ‌న్ పి.గ‌న్న‌వ‌రం లో ప‌ర్య‌టించనున‌న్నారు. 16వ తేదీన‌ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో ముఖ్య‌మంత్రి పాల్గొంటారు. ఇక్కడ నుండే నాడు-నేడు తొలిదశలో పూర్తి చేసిన పనులను ప్రజలకు అంకితం చేసి రెండో దశ నాడు-నేడు పనులకు మ‌ఖ్య‌మంత్రి శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశాక విద్యార్థులతో ముఖ్యమంత్రి జగన్ ముచ్చ‌టించ‌నున్నారు.

మ‌రోవైపు రానున్న అయిదు రోజుల్లో వర్షసూచన ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈనెల 16 నుండి పాఠ‌శాల‌లు తెరుస్తున్న నేప‌థ్యంలో సీఎం గ‌న్న‌వ‌రం ఉన్న‌త పాఠ‌శాల‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో హాజ‌ర‌వ‌డం ఆస‌క్తిగా మారింది. క‌రోనా పై విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు కూడా సీఎం ఈ కార్య‌క్రమాన్ని చేపుడుతున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news