Breaking : జగన్‌ విశాఖ పర్యటన వాయిదా..

-

ఏపీ సీఎం జగన్‌ విశాఖ పర్యటన వాయిదా వేస్తున్నట్లు సీఎంవో అధికారుల వెల్లడించారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా విశాఖ‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్ట‌నున్న పర్య‌ట‌న వాయిదా పడింది. ఆటో డ్రైవ‌ర్ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న వాహ‌న మిత్ర నిధుల‌ను విడుద‌ల చేసే నిమిత్తం ఈ నెల 13న విశాఖ ప‌ర్య‌ట‌న‌ను జ‌గ‌న్ ఖ‌రారు చేసుకున్న విషయం విధితమే. అయితే.. విశాఖ‌లోని ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఏర్పాటు చేయ‌నున్న కార్య‌క్ర‌మంలో వాహ‌న మిత్ర నిధుల‌ను ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు సీఎం జ‌గ‌న్.

YS Jagan Mohan Reddy: 95% Of Poll Promises Fulfilled, Says Andhra Pradesh  Chief Minister

అయితే గ‌డిచిన రెండు రోజులుగా దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయంటూ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిక‌లు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ఈ నెల 15కు వాయిదా వేస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం సోమ‌వారం సాయంత్రం వెల్లడించింది. ఈ టూర్ షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news