పోలవరం నిర్వాసితులకు జగన్ శుభవార్త…నేడు పునరావాస కాలనీల ప్రారంభం

-

తూర్పుగోదావరి జిల్లా ; నేడు సీఎం జగన్., కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ తో కలిసి తూర్పు ఏజెన్సీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. పోలవరం నిర్వాసితుల కోసం నిర్మించిన పునరావాస కాలనీల ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. ఇవాళ ఉదయం 10 గంటలకు దేవీపట్నం మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకుంటారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

ఇక్కడి నుంచి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు ఇందుకూరుపేట-1 పునరావాస కాలనీకి వస్తారు. కాలనీని 10.40 గంటలకు పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడతారు. 11 గంటలకు ఇక్కడి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి పశ్చిమగోదావరి వెళ్తారు సీఎం జగన్‌. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్… ఇవాళ్టి పర్యటన నేపధ్యంలో తూర్పు ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలో భారీగా ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. మవోయిస్టులు ప్రభావిత ప్రాంతం కావడంతో పారమిలటరీ దళాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక ఈ పర్యటన అనంతరం.. తిరిగి క్యాంపు కార్యాలయానికి మధ్యాహ్నం వెళ్లనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news